నిబద్ధతకు నిలువెత్తు నిదర్శన నడకుదిటి
ABN , First Publish Date - 2021-04-19T06:03:30+05:30 IST
దివంగత మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి చేసిన సేవలు తెలుగు జాతి మరువలేనివని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు.
మాజీ మంత్రులు పితాని, పిన్నమనేని నివాళి
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 18 : దివంగత మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి చేసిన సేవలు తెలుగు జాతి మరువలేనివని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. కొల్లు రవీంద్ర ఇంటివద్ద జరిగిన సంతాపసభలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తదితరులు పరామర్శించారు. నడకుదిటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిన్నమనేని మాట్లాడుతూ, నిజాయితీకి, నిబద్ధతకు నడకుదిటి నిలువెత్తు నిదర్శనమన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, తాను నమ్మిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు కొత్తపల్లి నాగేంద్ర కుమార్, గొర్రె పాటి గోపీచంద్, మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు, యండి ఇలియాస్ బాషా , పిప్పళ్ళ కాంతారావు, వాడపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.