నా భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు
ABN , First Publish Date - 2022-07-01T05:37:14+05:30 IST
తన భూమిని కొందరు వైసీపీ నాయకుల అండ చూసుకుని దౌర్జన్యంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని మండలంలోని అంభవరం గ్రామానికి చెందిన ముప్పాళ్ల శ్రీనివాసరాజు ఆరోపిస్తున్నారు.
నా భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు
సీఎస్పురం, జూన్ 30 : తన భూమిని కొందరు వైసీపీ నాయకుల అండ చూసుకుని దౌర్జన్యంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని మండలంలోని అంభవరం గ్రామానికి చెందిన ముప్పాళ్ల శ్రీనివాసరాజు ఆరోపిస్తున్నారు. అంభవరం గ్రామంలోని సర్వేనెంబర్ 144/1లో 2.76 ఎకరాలు, 137/3లో 76సెంట్ల భూమిని కొన్ని సంవ త్సరాల క్రితం గ్రామానికి చెందిన ఒకరి దగ్గర కొనుగోలు చేసి ఆరోజు నుంచి తను అ నుభవిస్తున్నానని అన్నారు. 2018లో అంభవరం గ్రామానికి చెంది బెం గళూరులో నివాసముంటున్న ఇద్దరు వ్యక్తులు ఆ భూమి తమదని కో ర్టులో దావా వేసారు. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. కానీ ఇ ప్పుడు కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చిందని గ్రామానికి చెందిన కొందరు అధి కారపార్టీ నాయకుల అండతో దౌర్జన్యంగా మేము గ్రామంలో లేని సమ యంలో భూమిలో ఎక్స్కవేటర్తో పొలాన్ని చదునుచేసి కంచెను ఏర్పా టు చేస్తున్నారని అడ్డుకుంటే అధికారాన్ని ఉపయోగించి తమపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అధి కారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.