చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-26T05:43:02+05:30 IST

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి విక్రమ్‌ సూచించారు. సోమవారం మండలంలోని జన్నేపల్లి, కోస్లీ, మిట్టాపూర్‌, యంచలో ఆయన చట్టాలపై అవగాహన కల్పించారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జడ్జి విక్రమ్‌

జిల్లా సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి విక్రమ్‌

నవీపేట, అక్టోబరు 25: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి విక్రమ్‌ సూచించారు. సోమవారం మండలంలోని జన్నేపల్లి, కోస్లీ, మిట్టాపూర్‌, యంచలో ఆయన చట్టాలపై అవగాహన కల్పించారు. సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రతీ గ్రామంలో చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతో ందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్‌ సాజిద్‌ అలీ, ప్రొబేషనరీ ఎస్సై ప్రేమ్‌సాగర్‌, వైస్‌ ఎంపీపీ హరీష్‌ కుమార్‌, ఏపీఎం భూమేష్‌ గౌడ్‌, ప్యానల్‌ న్యాయవాది శ్రీకాంత్‌, జన్నేపల్లి సర్పంచ్‌ సబిత, కోస్లీ సర్పంచ్‌ నీలేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:43:02+05:30 IST