పాఠశాల నిబంధనలపై అవగాహన ఉండాలి
ABN , First Publish Date - 2021-04-11T04:38:08+05:30 IST
పాఠశాలల్లో పాటించాల్సిన విఽధివిధానాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఎం ఈవో జయవేలు పేర్కొన్నారు.
చిట్వేలి, ఏప్రిల్10 : పాఠశాలల్లో పాటించాల్సిన విఽధివిధానాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఎం ఈవో జయవేలు పేర్కొన్నారు. శనివారం చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లకు, ప్రధానోపాధ్యాయులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా ఆర్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో ఆయాలుగా పనిచేస్తున్న వారు పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, అనంత కృష్ణశర్మ, నిర్మలాదేవి, బాబాఫకృద్దీన్, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పెంచలయ్య, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.