గెలుపే లక్ష్యంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-10-20T05:17:40+05:30 IST
విశాఖ జిల్లా అనకాపల్లిలో వచ్చే నవంబరు 6 నుంచి 8వ తేది వరకు జరుగనున్న 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో కప్ సాధించడమే లక్ష్యంగా జిల్లా క్రీడాకారులు బరిలోకి దిగాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు.
జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి
కడప(మారుతీనగర్), అక్టోబరు 19: విశాఖ జిల్లా అనకాపల్లిలో వచ్చే నవంబరు 6 నుంచి 8వ తేది వరకు జరుగనున్న 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో కప్ సాధించడమే లక్ష్యంగా జిల్లా క్రీడాకారులు బరిలోకి దిగాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆ పోటీలలో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ మంగళవారం స్థానిక మున్సిపల్ మైదానంలో జట్టుకోచ్ జనార్థన్ సారథ్యంలో జరిగింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోవర్ధన్రెడ్డితో పాటు చీఫ్కోచ్ బాషామోహిద్దీన్ హాజరై మాట్లాడారు. అనంతరం పురుషుల విభాగంలో 16 మంది, మహిళల విభాగంలో 14 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.