ముస్లింలను నట్టేట ముంచిన జగన్
ABN , First Publish Date - 2022-06-28T06:47:50+05:30 IST
ముస్లింలను నట్టేట ముంచిన జగన్
కంకిపాడు, జూన్ 27 : ముస్లిం, మైనార్టీలను సీఎం జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచాడని జనసేన పార్టీ జిల్లా నాయకులు పులి కామేశ్వరరావు విమర్శిం చారు. సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కంకిపాడులో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పులి కామేశ్వరరావు మాట్లాడుతూ, 2019 ఎన్నికల ముందు ముస్లిం, మైనార్టీలకు దుల్హన్ పథకం, వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన రూ. 5 లక్షల ఆర్థిక ప్యాకేజీ, ఇమామ్లకు ఇళ్లు, కనీస వేతనం అంటూ ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు. ఎన్నికల ముందు అన్ని వర్గాలకు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ముస్లిం, మైనార్టీలకు తక్షణం క్షమాపణ చెప్పి ముస్లిం, మైనారిటీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలను తక్షణం అమలు చేయాలని డి మాండ్ చేశారు. లేని పక్షంలో ముస్లిం, మైనార్టీ నాయకులతో కలిసి జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముప్పా రాజా, బొప్పన ప్రసాద్, బోయిన నాగరాజు, పచ్చి పాల శేఖర్, జరుగు ఆదినారాయణ, ఓంకార్, అన్సర్, మహేష్, పులి వేణు, కోన జనార్దన్రావు, ప్రకాష్, చలివేంద్రపాలెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.