ముస్లింలు దేవాలయాలను లాక్కున్నారు...Gyanvapi masgidపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-04T15:56:45+05:30 IST

జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

ముస్లింలు దేవాలయాలను లాక్కున్నారు...Gyanvapi masgidపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

పాట్నా(బీహార్): జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ముస్లింలు దేవుడిని మోసం చేసి హిందువులకు చెందిన అన్ని దేవాలయాలను లాక్కున్నారు’’ అని రామ్ సూరత్ రాయ్ ఆరోపించారు.ముస్లింలు తమ ఇంటికి వచ్చిన హిందువులకు ఇస్లామిక్ టోపీ పెట్టి స్వాగతం పలుకుతారనే ఉదాహరణను ఉటంకిస్తూ, అదే విధంగా ముస్లింలు దేవుళ్లను (భగవాన్ కో టోపీ పెహనా దియా) మోసం చేశారని, దేవాలయాలన్నింటిని లాక్కుని మసీదులను నిర్మించారని రామ్ సూరత్ రాయ్ అన్నారు. 


‘‘ఈ రోజు దేవుడు భూమి కింద నుంచి ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నాడు. ఎక్కడో రాధా కృష్ణ రూపంలో, ఎక్కడో శివుని రూపంలో, ఎక్కడో రాముని రూపంలో కనిపిస్తున్నాడు’’అని రామ్ సూరత్ రాయ్ అన్నారు.జ్ఞానవాపి మసీదు భూమి హిందువులకు చెందినది కాబట్టి ముస్లింలు రాబోయే రోజుల్లో ఆ భూమిని స్వయంగా వదులుకోవలసి ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-06-04T15:56:45+05:30 IST