పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ ముసలం?
ABN , First Publish Date - 2021-06-22T06:57:16+05:30 IST
కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ ముసలం మొదలైనట్లు కనబడుతోంది. సీఎం
చండీగఢ్, జూన్ 21: కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ ముసలం మొదలైనట్లు కనబడుతోంది. సీఎం అమరీందర్ సింగ్ సోమవారం ఢిల్లీ చేరుకొన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ నేతల్లో చెలరేగిన వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీతో ఆయన మంగళవారం రెండోమారు భేటీ కానున్నారు. అమరీందర్ను విమర్శించే వారిలో తొలి వరుసలో ఉండే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జాఖర్.. కమిటీ తొలి సమావేశ ఫలితంగా మెత్తబడినా..మళ్లీ ఇప్పుడు నిరసన గళం అందుకొన్నారు. నిరసన గళం వినిపిస్తున్న ఎమ్మెల్యేలు.. నవజ్యోత్ సింగ్ సిద్ధూకి రాష్ట్ర స్థాయిలో ‘పెద్ద స్థానం’ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.