మృతుల కుటుంబాలకు సంతాపం

ABN , First Publish Date - 2022-08-08T02:31:13+05:30 IST

మండలంలోని అయ్యవారిపల్లెలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త ఆవుల లక్ష్మీనరసింహం, అదే గ్రామంలో అనారోగ్యంతో మృతిచెం

మృతుల కుటుంబాలకు సంతాపం
లక్ష్మీనరసింహం మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఇంటూరి రాజేష్‌

వలేటివారిపాలెం, ఆగస్టు 7: మండలంలోని అయ్యవారిపల్లెలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త ఆవుల లక్ష్మీనరసింహం, అదే గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన టీడీపీ నాయకులు మంచాల చిన గంగయ్య మృతదేహాలకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాద్యక్షుడు ఇంటూరి రాజేష్‌లు ఆదివారం వేర్వేరుగా నివాళులు అర్పించారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.  వారి వెంట మండల  నాయకులు మాదాల లక్ష్మీనరసింహం, వలేటి నరసింహం, ఉప్పటూరి పెదకొండయ్య, మంచాల పెదకొండయ్య, భాస్కర్‌, వీరయ్య, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-08T02:31:13+05:30 IST