తాగిన మైకంలోనే హత్య

ABN , First Publish Date - 2021-06-19T05:17:15+05:30 IST

కొత్తపల్లి, జూన్‌ 18: మద్యం పూటుగా తాగిన మత్తులోనే గెడ్డం నాగేశ్వరరావును శ్రీను బండరాయితో హత్య చేశాడని కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి కొండెవరం శెట్టి రామాలయం వద్ద ఆంజనేయస్వామి గుడి వద్ద ఎల్‌.రాజు, గుత్తుల శ్రీను మద్యం

తాగిన మైకంలోనే హత్య
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భీమారావు

కొత్తపల్లి, జూన్‌ 18: మద్యం పూటుగా తాగిన మత్తులోనే గెడ్డం నాగేశ్వరరావును శ్రీను బండరాయితో హత్య చేశాడని కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి కొండెవరం శెట్టి రామాలయం వద్ద ఆంజనేయస్వామి గుడి వద్ద ఎల్‌.రాజు, గుత్తుల శ్రీను మద్యం తాగి గొడవ పడటం, వారిని విడిపించడానికి వచ్చిన గెడ్డం నాగేశ్వరరావు అనే బుజ్జిని బండరాయితో చితకబాదడం... అతడు చికిత్స పొందుతూ మృతి చెందడం విదితమే. దీనికి సం బంధించిన వివరాలను డీఎస్పీ కొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో శుక్రవారం వివరించారు. రాజు, శ్రీను గొడవపడుతున్న సందర్భంలో వారిని వారించి అక్కడే ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద తాగి న మైకంలో నాగేశ్వరరావు నిద్రలోకి జారుకున్నాడు. తన విషయంలో అతిగా జోక్యం చేసుకున్నాడని భావించిన శ్రీను మద్యం మత్తులో నాగేశ్వరరావు పొట్ట భాగంమీద బండరాయితో గడి గా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసును వేగవంతం చేశామని, శ్రీను నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్డుకు రిమాండ్‌కు పంపామని డీఎస్పీ తెలిపారు. దర్యాప్తునకు సహకరించిన సీఐ వైఆర్కే శ్రీనివాస్‌, ఎస్‌ఐ అబ్దుల్‌ నబీ, ఏఎ్‌సఐలు, పీసీలను ఆయన అభినందించారు.

Updated Date - 2021-06-19T05:17:15+05:30 IST