నల్లబ్యాడ్జీలతో మున్సిపల్ సిబ్బంది నిరసన
ABN , First Publish Date - 2022-06-25T05:13:44+05:30 IST
రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబుపై అక్కడి మున్సిపల్ కౌన్సిలర్ కె.నర్శింహారెడ్డి మరో 20
కందుకూరు, జూన్ 24: రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబుపై అక్కడి మున్సిపల్ కౌన్సిలర్ కె.నర్శింహారెడ్డి మరో 20 మందితో కలిసి దాడిచేసి కొట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం కందుకూరు మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిరసన తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ ఆధ్వర్యంలో మేనేజరు శ్రీనివాసన్, ఆర్వో రాజు సహా ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కమిషనర్పై అధికార పార్టీ కౌన్సిలర్ భౌతిక దాడికి దిగటం గర్హనీయమని, తక్షణం కౌన్సిలర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాం డ్ చేశారు.