Tomato: ముంబై మహిళ ప్రాణాలు తీసిన టమాటో.. టీవీ చూస్తూ మ్యాగీ తిన్న మహిళ చివరకు..

ABN , First Publish Date - 2022-07-30T02:43:27+05:30 IST

ముంబై(Mumbai) కి చెందిన ఓ మహిళ మ్యాగీ (Maggi) చేసుకుని తీరిగ్గా టీవీ ముందు కూర్చుని తినడం ప్రారంభించింది.

Tomato: ముంబై మహిళ ప్రాణాలు తీసిన టమాటో.. టీవీ చూస్తూ మ్యాగీ తిన్న మహిళ చివరకు..

ముంబై(Mumbai) కి చెందిన ఓ మహిళ మ్యాగీ (Maggi) చేసుకుని తీరిగ్గా టీవీ ముందు కూర్చుని తినడం ప్రారంభించింది. కొద్ది సేపటికి ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. హాస్పిటల్‌లో వారం రోజుల పాటు చికిత్స అందుకుని మరణించింది. ఆమె మరణానికి (Mumbai woman dies) మ్యాగీలో వేసిన టమాటోనే కారణం. ఈ ఘటన మహారాష్ట్ర ముంబైలోని మలాద్ ప్రాంతంలో జరిగింది. మలాద్‌లో నివసిస్తున్న రేఖా దేవి(35) ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ.

 

ఇది కూడా చదవండి..

Viral Video: టవల్‌ను మింగేసిన కొండ చిలువ.. దానిని డాక్టర్లు ఎలా కాపాడారంటే..?


వాటిని చంపేందుకు రేఖ ఎలుకల మందు తీసుకువచ్చి టమోటాలో పెట్టి ఉంచింది. ఆ తరువాత మ్యాగీ చేసుకుంది. అయితే, ఆ మ్యాగీలో అనుకోకుండా ఎలుకల మందు పెట్టిన టమోటా వేసేసింది. ఆ తరువాత టీవీ చూస్తూ ఆ మ్యాగీని (Maggi laced with poisoned tomato) తినేసింది. కొద్దిసేపటికి ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె పరిస్థితి గమనించిన భర్త వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. హాస్పిటల్‌లో వారం రోజుల పాటు చికిత్స పొందిన రేఖ చివరకు ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2022-07-30T02:43:27+05:30 IST