ముంబైలోని అంబేద్క‌ర్ ఇంటిపై దాడి... ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసు‌లు!

ABN , First Publish Date - 2020-07-08T13:28:41+05:30 IST

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఇంటిలో బాబా సాహెబ్ వారసులు ప్రకాష్ అంబేద్కర్, ఆనందరాజ్...

ముంబైలోని అంబేద్క‌ర్ ఇంటిపై దాడి... ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసు‌లు!

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఇంటిలో బాబా సాహెబ్ వారసులు ప్రకాష్ అంబేద్కర్, ఆనందరాజ్ అంబేద్కర్ ఉంటున్నారు. దుండగులు ఆ ఇంటిలోని తోట, వరండాను ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ విచారణకు ఆదేశించారు. అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ఈ సంఘటనపై త‌క్ష‌ణం దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించామ‌ని, నిందితులను అరెస్టు చేస్తామ‌ని తెలిపారు. కాగా ప్రకాష్ అంబేద్కర్ మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియ‌ని ఇద్దరు వ్యక్తులు త‌మ ఇంటిపై దాడి చేశార‌ని, సీసీటీవీని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించార‌ని ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-07-08T13:28:41+05:30 IST