ముంబైలో అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2022-01-23T07:44:06+05:30 IST

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రల్‌ ముంబై టార్డియో ప్రాంతంలోని 19వ అంతస్తులో సంభవించిన ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. 12 మంది....

ముంబైలో అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి


ముంబై, జనవరి 22: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రల్‌ ముంబై టార్డియో ప్రాంతంలోని 19వ అంతస్తులో సంభవించిన ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం ఉదయం 7 గంటలకు జరగడం.. ఆ సమయంలో ఎక్కువ మంది నిద్రలో ఉండడంతో.. బాధితుల సంఖ్య పెరిగిందని బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. 

Updated Date - 2022-01-23T07:44:06+05:30 IST