ఆంధ్రాలో ఇవేమి రాజకీయాలు : ఎమ్మెల్యే సీతక్క
ABN , First Publish Date - 2021-10-25T06:04:28+05:30 IST
ఆంధ్రా రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని, అధికార పార్టీ హుందాగా వ్యవహరించి, కక్ష సాధింపులు మానుకోవాలని తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
కడియం, అక్టోబరు 24 : ఆంధ్రా రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని, అధికార పార్టీ హుందాగా వ్యవహరించి, కక్ష సాధింపులు మానుకోవాలని తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కడియం మండలం మురమండలో జరిగిన వివాహ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ రోజురోజుకీ బలపడుతోందని అన్నారు.
ఆంధ్రాలో కూడా పార్టీ బలోపేతం చేయడానికి అన్ని చర్యలు
తీసుకుంటున్నారన్నారు. రాజకీయాలు హుం దాగా ఉండాలని, అధికార, ప్రతిపక్షాలు
రోడ్డెక్కి గొడవలు పడడం శ్రేయస్కరం కాదని ఆమె అన్నారు. అధికారం ఎవరికీ
శాశ్వతం కాదనే విషయాన్ని మరవకూడదని సీతక్క అన్నారు. ఈ రాష్ట్రంలో రోడ్లు
అధ్వానంగా ఉన్నాయన్నారు. గతంలో రాజమహేంద్రవరంలో జరిగిన టీడీపీ మహానాడు
కార్యక్రమానికి తాను హాజరయ్యానని, అప్పటికి, ఇప్పటికీ ఈ ప్రాంతం ఎంతో
మార్పు చెందిందని అన్నారు.