శాస్త్రోక్తంగా ముక్కంటి ఊంజల్సేవ
ABN , First Publish Date - 2021-10-20T05:32:20+05:30 IST
పౌర్ణమి పురస్కరించుకుని మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్ల ఊంజల్సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తి, అక్టోబరు 19: పౌర్ణమి పురస్కరించుకుని మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా స్వామి, అమ్మవార్ల ఊంజల్సేవ నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఊరేగింపుగా ఊంజల్సేవ మండపానికి తీసుకుని వచ్చి నైవేద్యం, దీపారాధన, మంత్రపుష్పం జరిపించారు. తరలి వచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్, సూపరింటెండెంట్ విజయసారథి తదితరులు పాల్గొన్నారు.