ముఖ్ర (కె) నిధులు రూ.కోటీ 41లక్షలు

ABN , First Publish Date - 2021-01-16T05:40:21+05:30 IST

మండలంలోని ముఖ్ర(కె) గ్రామం 20 ఏళ్ల క్రితం ఐదుగురు సభ్యులచే రూ.12వేలతో ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ధి కమిటీ నిధి నేడు రూ.కోటీ 41లక్షల 44వేలకు చేరుకుంది. 2000 యేడాది సంక్రాంతి రోజున గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వీడీసీని ఏర్పాటు చేశారు.

ముఖ్ర (కె) నిధులు రూ.కోటీ 41లక్షలు

ఇచ్చోడరూరల్‌, జనవరి 15: మండలంలోని ముఖ్ర(కె) గ్రామం 20 ఏళ్ల క్రితం ఐదుగురు సభ్యులచే రూ.12వేలతో ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ధి కమిటీ నిధి నేడు రూ.కోటీ 41లక్షల 44వేలకు చేరుకుంది. 2000 యేడాది సంక్రాంతి రోజున గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వీడీసీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా గాడె ్గసుభాష్‌ను ఎన్నుకోగా 12వేల రూపాయలతో నిధిని ఏర్పాటు చేశారు. గ్రామంలో అవసరం కోసం డబ్బులు వడ్డీకి తీసుకుని యేడాది అనంతరం సంక్రాంతి రోజున వీడీసీకి ఇవ్వాల్సి ఉంది. వీడీసీ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన డబ్బులను శుక్రవారం వసూలు చేయగా రూ.కోటీ 41లక్షల 44వేల రూపాయలు జమయ్యాయి. గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నిధుల నుంచి పాఠశాలలో విద్యావలంటీర్లను నియమించడం, ఇటీవల కొత్తగా పంచాయతీ ఏర్పాటు కావడంతో మూడు లక్షల నిధులతో స్థలాన్ని కొనుగోలు చేశారు.

Updated Date - 2021-01-16T05:40:21+05:30 IST