‘కరోనాను తరిమేద్దాం’
ABN , First Publish Date - 2020-04-04T10:08:23+05:30 IST
స్వీయ నిర్బంధం పాటించి కరోనా వైరస్ను భారతదేశం నుంచి తరిమేద్దాం అని ఎంపీ సంజీవ్కుమార్ ప్రజలకు పిలుపు నిచ్చారు.
కోడుమూరు, ఏప్రిల్ 3: స్వీయ నిర్బంధం పాటించి కరోనా వైరస్ను భారతదేశం నుంచి తరిమేద్దాం అని ఎంపీ సంజీవ్కుమార్ ప్రజలకు పిలుపు నిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి 7గంటలకు ఆయన సందర్శిం చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా నియంత్ర ణలో భాగంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు అనవసరంగా రోడ్ల మీదకు రాకుండా ఉండాలని అన్నా రు. కరోనా నివారణలో భాగంగా వైద్య సిబ్బంది, పోలీసు, వివి ధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. అనంతరం అధికారులకు శానిటైజర్లను పంపిణీ చేశారు. సీఐ పార్థసా రథిరెడ్డి, ఎస్ఐ మల్లికార్జున, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు వైసీపీ యువ నాయకుడు ప్యాలకుర్తి రమేష్ పాల్గొన్నారు.
క్వారంటైన్ కేంద్రం తనిఖీ
సి.బెళగల్: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవకుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. నోడల్ ఆఫీసర్ రంగ తులశమ్మతో మాట్లాడుతూ క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారందరికి మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ సూచించారు. ఎంపీ వెంట వైద్యాధికారులు రంగస్వామిరెడ్డి, ప్రసాద్రెడ్డి, హరిత, నాగరాజు, వైసీపీ నాయకులు ఈరన్నగౌడు, బొంతల మునెప్ప, ప్రభాకరెడ్డి, సోమశేఖరెడ్డి ఉన్నారు.