యూరియా పంపండి

ABN , First Publish Date - 2020-09-22T08:11:42+05:30 IST

తెలంగాణకు ఈ నెల కు కేటాయించిన యూరియా మొ త్తాన్ని పంపించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశా రు. లోక్‌సభలో సోమవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు...

యూరియా పంపండి

  • ఎంపీ రంజిత్‌ రెడ్డి 

న్యూఢిల్లీ: తెలంగాణకు ఈ నెల కు  కేటాయించిన యూరియా మొ త్తాన్ని పంపించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశా రు. లోక్‌సభలో సోమవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు.  ఈ నెలలో 2.1 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా  అవసరమవుతుందని అంచనా, అయితే ఇప్పటి వరకు 1.14 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే  పంపించారని వివరించారు.  రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి నుంచి 1.34 కోట్ల ఎకరాలకు పెరిగిందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత స్థాయిలో పెరగలేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని ఝరసంగంలో ఏర్పాటు చేస్తున్న కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాలు నిర్మించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ కోరారు. 


Updated Date - 2020-09-22T08:11:42+05:30 IST