మినీ మహానాడుకు తరలిరండి

ABN , First Publish Date - 2022-07-03T04:47:01+05:30 IST

వైసీపీ ప్రభుత్వం దుశ్చర్య లను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ నెల 6న మద నపల్లె పట్టణంలో నిర్వహిస్తున్న మినీ మహానాడు కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

మినీ మహానాడుకు తరలిరండి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, జూలై 2: వైసీపీ ప్రభుత్వం దుశ్చర్య లను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ నెల 6న మద నపల్లె పట్టణంలో నిర్వహిస్తున్న మినీ మహానాడు కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాయచోటి నియోకవర్గం లోని ఆరు మండలాల నుండి టీడీపీ నేతలు, కార్యకర్త లు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా రావా లని పిలుపునిచ్చారు. మూడేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాల న్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి వతన్‌నిస్సార్‌, రాయచోటి మండల శాఖ అధ్యక్షుడు మురికినాటి వెంకట సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-03T04:47:01+05:30 IST