మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-04-10T05:40:13+05:30 IST

జిల్లాకేంద్రంలో తెల్లవారుజామున 1వ టౌన్‌ పోలీసులు ద్విచక్ర వాహనాల దొంగను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్టు

 27 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ఖిల్లా, ఏప్రిల్‌ 9: జిల్లాకేంద్రంలో తెల్లవారుజామున 1వ టౌన్‌ పోలీసులు ద్విచక్ర వాహనాల దొంగను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని బోధన్‌ బస్టాండ్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 1వ టౌన్‌ పోలీసులు ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు నేతృత్వంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. భైంసా పట్టణానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌గా గుర్తించారు. జిల్లాకేంద్రంలోని పలు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో సుమారు 27 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో 27 వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల 1వ టౌన్‌ పరిధిలోని ఖలీల్‌వాడిలో బైక్‌ చోరీకి గురికావడంతో బైక్‌ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వాహనదారులపై తనిఖీ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వారికి దొగిలించిన వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుడిని పట్టుకున్నందుకు నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ 1వ టౌన్‌ పోలీస్‌ సిబ్బందిని అభినందించారు. 


Updated Date - 2021-04-10T05:40:13+05:30 IST