మోతీనగర్‌ రోడ్లపై నడక నరకప్రాయమే!

ABN , First Publish Date - 2020-10-17T06:09:29+05:30 IST

మోతీనగర్‌ 45వ డివిజన్‌లో రోడ్లు అధ్వానంగా మారాయి. రోజురోజుకీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా

మోతీనగర్‌ రోడ్లపై నడక నరకప్రాయమే!

అధికారులూ పట్టించుకోండి


ఖమ్మం మామిళ్లగూడెం, అక్టోబరు16: మోతీనగర్‌ 45వ డివిజన్‌లో రోడ్లు అధ్వానంగా మారాయి. రోజురోజుకీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరించడంలోనూ... కాలనీల్లో సీసీ రోడ్లు వేయించడంలో కార్పొరేషన్‌ అధికారులు అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పన్నుల రూపంలో కడుతున్నా తాము కనీస రోడ్డు సౌకర్యానికి కూడా నోచుకోలేక పోతున్నామంటూ మోతీనగర్‌ కాలనీ వాసులు చెబుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయి దోమలు, రకరకాల క్రిమికీటకాలు రొద పెడుతున్నాయని రాత్రిళ్లు కునుకుండడంలేదంటున్నారు.


కొత్తగా ఏర్పాటైన వీధుల్లో రోడ్లు అధ్వాన్నంగామారిపోయాయయని ఈ రోడ్లపై నడవాలంటేనే నరకాన్ని చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు స్పందించి మోతీనగర్‌ వాసులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-10-17T06:09:29+05:30 IST