ఆడబిడ్డ పుట్టిందని అప్పగించేసింది!

ABN , First Publish Date - 2021-02-24T06:27:51+05:30 IST

కాకినాడ క్రైం, ఫిబ్రవరి 23: ఓ తల్లి పేగు తెంచుకుపుట్టిన ఆడబిడ్డను ఇతరులకు ఇచ్చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెం దిన ఓ మహిళ వారం కిందట పురుటి నొప్పులతో కాకినాడ జీజీహెచ్‌లో ఆడబిడ్డకు జన్మించింది. అప్పటికే ఆమెకు ఇద్దరు బాలికలు, బాబు ఉన్నారు. మళ్లీ బాలిక జన్మించడంతో ఇష్టం లేని బాలింత ఇంట్లో కుటుంబ సభ్యులు, భర్తకు ఏమా

ఆడబిడ్డ పుట్టిందని అప్పగించేసింది!

కాకినాడ క్రైం, ఫిబ్రవరి 23: ఓ తల్లి పేగు తెంచుకుపుట్టిన ఆడబిడ్డను ఇతరులకు ఇచ్చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెం దిన ఓ మహిళ వారం కిందట పురుటి నొప్పులతో కాకినాడ జీజీహెచ్‌లో ఆడబిడ్డకు జన్మించింది. అప్పటికే ఆమెకు ఇద్దరు బాలికలు, బాబు ఉన్నారు. మళ్లీ బాలిక జన్మించడంతో ఇష్టం లేని బాలింత ఇంట్లో కుటుంబ సభ్యులు, భర్తకు ఏమాత్రం చెప్పాపెట్టకుండా తనకు తెలిసిన వాళ్లకు పసిపాపను ఇచ్చేసింది. పాప విషయమై భర్త నిలదీయగా మృతిచెందిందని చెప్పి నమ్మబలికించింది. అనుమానంతో భర్త ఔట్‌పోస్ట్‌ పోలీసులను ఆశ్రయించగా విచారణ చేశారు. ఈ విచారణలో చిన్నారి మృతిచెందలేదని, జన్మనిచ్చిన తల్లే ఇతరుకు చిన్నారిని ఇచ్చేసిందని పోలీసులు నిర్థారించడంతో కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. బాలికను పెంచడం భారంగా ఉంటుందనే ఇతరులకు పెంపకం కోసం ఇచ్చేశానని, డబ్బులకు ఇవ్వలేదని తల్లి స్పష్టం చేసింది. నాలుగురోజుల కిందటే బాలింత, బిడ్డను డిశ్చార్జ్‌ చేశారని పోలీసులు తేల్చడంతో తల్లిని విచారించి బిడ్డను తీసుకెళ్లిన వారిని జీజీహెచ్‌కు రప్పించి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. 


Updated Date - 2021-02-24T06:27:51+05:30 IST