మోటారు సైకిళ్ల ఢీ : ఒకరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-03-03T02:36:20+05:30 IST

రాపూరు-నెల్లూరు రోడ్డులో కండలేరు డ్యాం రోడ్డు పాయింటుకు శానాయపాళెం గ్రామానికి మధ్య ఎదురెదుగా వస్తున్న మోటారు సైకిళ్లు మంగళవారం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మండలంలోని సైదాదుపల్లికి చెందిన నారాయణ (40) చిలకలూరిపేటకు చెందిన కీ

మోటారు సైకిళ్ల ఢీ : ఒకరి దుర్మరణం

ఇద్దరికి గాయాలు

రాపూరు, మార్చి 2: రాపూరు-నెల్లూరు రోడ్డులో  కండలేరు డ్యాం రోడ్డు పాయింటుకు శానాయపాళెం గ్రామానికి మధ్య ఎదురెదుగా వస్తున్న మోటారు సైకిళ్లు మంగళవారం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మండలంలోని  సైదాదుపల్లికి చెందిన నారాయణ (40) చిలకలూరిపేటకు చెందిన కీర్తికి తీవ్రగాయాలయ్యాయి, కీర్తి భర్త రాకేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. ముగ్గురిని పొదలకూరు 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నారాయణ మృతిచెందాడు. కీర్తికి తీవ్రగాయాలు కావడంతో కీర్తి, రాకేష్‌లను మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. కీర్తి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కండలేరు డ్యాం పోలీసులు తెలిపారు. 






 













Updated Date - 2021-03-03T02:36:20+05:30 IST