కరోనా నుంచి మహారాష్ట్ర కోలుకునేనా.. నేడు 8వేలకు పైగా..

ABN , First Publish Date - 2020-07-12T02:48:01+05:30 IST

దేశం మొత్తం కరోనా వ్యాపిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో తక్కవ సంఖ్యలో కేసులు ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో...

కరోనా నుంచి మహారాష్ట్ర కోలుకునేనా.. నేడు 8వేలకు పైగా..

ముంబై: దేశం మొత్తం కరోనా వ్యాపిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో తక్కవ సంఖ్యలో కేసులు ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కవగా ఉన్నాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం అదుపు చేయలేని స్థాయిలోకి చేరుకుంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కేసులను చూస్తే మహారాష్ట్ర మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందనే నమ్మకం కూడా అక్కడి ప్రజల్లో సన్నగిల్లుతోంది. దేశంలోనే అత్యంత దారుణంగా కరోనా బారిన పడిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.  ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై ప్రాంతమే దీనికి కారణం కావడం గమనార్హం. ఈ రోజు కూడా దాదాపు 8వేలకు పైగా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2లక్షల46వేలు దాటేసింది.


10వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,139 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 223 మంది మరణించారు. 4,360 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,46,600కి చేరింది. వీరిలో 99,202మంది చికిత్స పొందుతుండగా 1,36,985మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 10,116మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-12T02:48:01+05:30 IST