త్యాగాలకు ప్రతీక మొహర్రం
ABN , First Publish Date - 2022-08-10T05:15:51+05:30 IST
త్యాగాలకు ప్రతీక అయిన మొహర్రం సందర్భంగా వీరవాసరంలో పీర్లు శిబిరాన్ని పలువురు దర్శించుకున్నారు.
వీరవాసరం, ఆగస్టు 9: త్యాగాలకు ప్రతీక అయిన మొహర్రం సందర్భంగా వీరవాసరంలో పీర్లు శిబిరాన్ని పలువురు దర్శించుకున్నారు. కర్బలా మైదానంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ఏర్పాటుచేసిన పీర్లకు వందనాలు సమర్పించారు. మొహర్రం శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. హిందూ, ముస్లిం బేధం లేకుండా పీర్లను దర్శించారు. మొహరం సందర్భంగా నిప్పుల గుండం తొక్కేందుకు భక్తులు ఉపవాస దీక్షను ఆచరించారు.
పెనుగొండ: మండలంలోని వడలిలో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో పీర్ల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్లతో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో గ్రామోత్సవంలో పాల్గొన్నారు.