మోదీ పాలనపై సర్వే చేయగా.. రిజల్ట్ ఇదీ..
ABN , First Publish Date - 2022-05-31T08:32:31+05:30 IST
మోదీ పాలనపై సర్వే చేయగా.. రిజల్ట్ ఇదీ..
- పాలన భేష్!
- మెచ్చుకున్న 67% మంది..
- ధరలపై 73% మంది ఆందోళన
న్యూఢిల్లీ, మే 30: ప్రధాని మోదీ ప్రజాదరణ గరిష్ఠ స్థాయికి చేరింది. ఎనిమిదేళ్ల పాలనలోనే అత్యధిక ప్రజాదరణ పొందినట్లు తాజా సర్వేలో తేలింది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగిత ఆయన ప్రజాదరణపై ఎలాంటి ప్రభావం చూపలేదు. లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో పాల్గొన్న 64 వేల మందిలో 67% మంది మోదీ రెండో దఫా పాలన తమ అంచనాలకు మించి ఉందని అభిప్రాయ పడ్డారు.
గత ఏడాది రెండో దఫా కొవిడ్ సందర్భంగా వేల మరణాలతో దేశం అల్లాడుతున్నప్పుడు ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 51% మంది మాత్రమే ఆయన సమర్థంగా వ్యవహరిస్తున్నారని మెచ్చుకున్నారు. 47% మంది మాత్రం 7% చేరిన నిరుద్యోగితపై ఆందోళన వ్యక్తం చేశారు. 73% మంది నిత్యావసరాల ధరలపై ఆందోళన వ్యక్తం చేశా రు. 73% మంది తమ కుటుంబ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 60% మంది మతసామరస్యంపై ప్రభుత్వం సరిగ్గానే వ్యవహరిస్తోందని చెప్పారు.