వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ మాటా మంతి ఈ నెల 8న

ABN , First Publish Date - 2020-04-05T00:00:55+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిపై దేశమంతా కలిసికట్టుగా పోరాడుతున్న సమయంలో రాజకీయ పార్టీలతో మాట్లాడాలని

వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ మాటా మంతి ఈ నెల 8న

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై దేశమంతా కలిసికట్టుగా పోరాడుతున్న సమయంలో రాజకీయ పార్టీలతో మాట్లాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపిన వివరాల ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ మాట్లాడతారు. ఈ కార్యక్రమం ఈ నెల 8న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది.


కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడం, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం వంటి అంశాలపై మోదీ చర్చించే అవకాశం ఉంది. అష్ట దిగ్బంధనం అమలు చేసిన తర్వాత మోదీ ప్రతిపక్షాలతో మాట్లాడటం ఇదే తొలిసారి అవుతుంది. 


ఇదిలావుండగా కోవిడ్-19పై వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నెంబరును మోదీ ప్రకటించారు. ఈ నెంబరు : 9013151515. ఈ-మెయిల్ ఐడీ : ncov2019@gmail.com.


Updated Date - 2020-04-05T00:00:55+05:30 IST