ఆసుపత్రిలో చేరిన Raj Thackeray..

ABN , First Publish Date - 2022-05-31T21:12:14+05:30 IST

మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్‌ థాకరే ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలికి వైద్యులు ..

ఆసుపత్రిలో చేరిన Raj Thackeray..

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్‌ థాకరే (Raj Thackeray) ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలికి వైద్యులు బుధవారం శస్త్రచికిత్స  చేయనున్నారు. ప్రస్తుతం సర్జరీ జరపడానికి ముందు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం రెండు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది. రాజ్‌థాకరే సైతం కొద్దిరోజుల క్రితం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో తన సర్జరీ సమాచారం తెలిపారు.


 రాజ్‌థాకరే 15 రోజుల క్రితం పుణె పర్యటనకు వెళ్లారు. అయితే మధ్యలోనే పర్యటన ముగించుకుని ముంబై తిరిగివచ్చారు. ఆ తర్వాతనే ఆయన అయోధ్య టూర్ వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రకారం జూన్ 5న ఎంఎన్‌ఎస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలతో అయోధ్య వెళ్లేందుకు రాజ్‌థాకరే ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. అయితే కాలి నొప్పి తీవ్రం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. దాంతో అయోధ్య పర్యటన వాయిదాకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2022-05-31T21:12:14+05:30 IST