పింఛన్ల పెంపులో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ బుద్ద
ABN , First Publish Date - 2020-08-11T14:44:44+05:30 IST
పింఛన్లు పెంచుతామని ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చి, గెలుపొందిన..
అనకాపల్లి(విశాఖపట్నం): పింఛన్లు పెంచుతామని ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చి, గెలుపొందిన అనంతరం చెల్లింపులు చేపట్టడంలో విఫలమయ్యారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఏటా రూ.250 చొప్పున పెంచుతామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు రూ.2500లు చెల్లించాల్సి ఉండగా, ఆ దిశగా కృషి చేయలేదని ఆరోపించారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు వేతనాలు సైతం చెల్లించడం లేదని, ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.