తాగు నీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-05-19T04:33:01+05:30 IST
మండలంలోని పారా గ్రామస్థులకు ఎమ్యెల్యే ఆత్రం సక్కుచొరవతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. తమకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల పారా గ్రామస్థులు ఎమ్యెల్యే ఆత్రం సక్కును వేడుకున్నారు. ఈ విష యాన్ని దృష్టిలో పెట్టుకుని పారా గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించేం దుకు బోరు వేయించారు. దీంతో గ్రామస్థుల ఆనందానికి అంతులే కుండా పోయింది.
జైనూరు, మే 18: మండలంలోని పారా గ్రామస్థులకు ఎమ్యెల్యే ఆత్రం సక్కుచొరవతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. తమకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల పారా గ్రామస్థులు ఎమ్యెల్యే ఆత్రం సక్కును వేడుకున్నారు. ఈ విష యాన్ని దృష్టిలో పెట్టుకుని పారా గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించేం దుకు బోరు వేయించారు. దీంతో గ్రామస్థుల ఆనందానికి అంతులే కుండా పోయింది. డోలు, సన్నాయిలతో బోరుబావి వద్ద ఆదివాసులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్యెల్యే ఆత్రం సక్కు చేసిన ఉపకారం ఎన్నడూ మరువలేనిదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్రహజ్కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాల, ఉపసర్పంచ్ కుంర జంగు, గ్రామ పటేల్ జుగాది రావ్, కినక యాదవ్రావ్, ఫయ్యాజ్ తదితరులు ఉన్నారు.