యడ్లపాటిని పరామర్శించిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-03-30T10:06:26+05:30 IST
రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావును ఆదివారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు.
తెనాలి టౌన్, మార్చి 29: రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావును ఆదివారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. కరోనా వైరస్ నివారణ చర్యల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే యడ్లపాటి గృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ నివారణకు పట్టణంలో తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించారు. మంచి పేరు తెచ్చుకోవాలని, అంతా శుభం జరగాలని వెంకట్రావు శివకుమార్ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, తహసీల్దారు రవిబాబు ఉన్నారు.