సీఆర్‌టీల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే వినతి

ABN , First Publish Date - 2021-10-29T05:04:00+05:30 IST

ఏజెన్సీలో కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పాశ్రీవాణికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అమరావతిలో వినతిపత్రం సమర్పించారు.

సీఆర్‌టీల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే వినతి
డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి


పాడేరు, అక్టోబరు 28: ఏజెన్సీలో కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పాశ్రీవాణికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అమరావతిలో వినతిపత్రం సమర్పించారు. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నా నేటికీ సీఆర్‌టీలను రెన్యువల్‌ చేయకపోవడంతో గిరిజన విద్యావ్యవస్థ పాడవుతుందన్నారు. అలాగే సీఆర్‌టీలకు ఐదు నెలలుగా వేతనాలను చెల్లించకపోవడంతో కుటుంబాలతో పస్తులుంటున్నారని, తక్షణమే వారిని రెన్యువల్‌ చేయాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు. అందుకు స్పందించిన డిప్యూటీ సీఎం, సీఆర్‌టీల నియామకాలపై మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే వారి నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-29T05:04:00+05:30 IST