అభివృద్ధికి అందరూ సహకరించాలి
ABN , First Publish Date - 2022-01-22T04:08:47+05:30 IST
మండల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని, నాయకులు, ప్రజలు సహకారాన్ని అందిస్తే వైరా నియోజకవర్గంలోనే జూలూరుపాడును ఆదర్శ మండలం గా తీర్చి దిద్దుతానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు.
అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్
జూలూరుపాడు, జనవరి 21: మండల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని, నాయకులు, ప్రజలు సహకారాన్ని అందిస్తే వైరా నియోజకవర్గంలోనే జూలూరుపాడును ఆదర్శ మండలం గా తీర్చి దిద్దుతానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని పాపకొల్లు రైతు వేదికలో పాపకొల్లు గ్రామస్థాయి అఖిలపక్ష నాయకులు, ప్రజలతో సమా వేశాన్ని సర్పంచ్బాదావత్ లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో సుమారు రూ. 5కోట్ల నిధులతో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీల పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వేగవంతం చేస్తానని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మండల అభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నానని తెలిపారు. సమావేశంలో సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారావు, సర్పంచ్ కిషన్లాల్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.