ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ కార్మికులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2022-02-07T17:40:43+05:30 IST
జిల్లాలోని సదాశివపేటలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం ఉదయం పర్యటించారు.
సంగారెడ్డి: జిల్లాలోని సదాశివపేటలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ కార్మికులను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబాలకు అండగా ఉంటా అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనుకోకుండా ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ మూతపడిందని... కార్మికులకు కంపెనీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదన్నారు. కార్మికులు కోరుతున్నట్లు 65 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 100 గజాల స్థలం , రూ.5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్స్ నెరవేర్చకుండా క్వాటర్స్ ఖాళీ చేయాలని చూస్తే స్థానిక ఎమ్మెల్యేగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.