ఎమ్మెల్యేలను కించపరిచేలా పోస్టింగులు
ABN , First Publish Date - 2021-04-17T05:57:25+05:30 IST
వైసీపీ ఎమ్మెల్యేలను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టడంపై చంద్రబాబు, లోకేశ్పై చర్యలు తీసుకోవాలంటూ సత్యవేడు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సత్యవేడు, ఏప్రిల్ 16: వైసీపీ ఎమ్మెల్యేలను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టడంపై చంద్రబాబు, లోకేశ్పై చర్యలు తీసుకోవాలంటూ సత్యవేడు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. టీడీపీకి చెందిన పలువురు సాహో చంద్రబాబు పేరిట వాట్సప్ గ్రూపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సత్యవేడు, సూళూరుపేట, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆదిమూలం, సంజీవయ్య, వరప్రసాద్పై పలు పోస్టింగులు ఉంచారు. దీంతో టీడీపీ వాట్సప్ గ్రూపులో వైసీపీ ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టింగులు పెట్టడంపై ఎమ్మెల్యే ఆదిమూలం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి శుక్రవారం ఆయన సత్యవేడు ఎస్ఐ నాగార్జునరెడ్డిని కలసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నాయకులు బీరేంద్రవర్మ, నిరంజన్రెడ్డి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.