క్షణికావేశంతో చేసిన తప్పుల్ని సరిచేసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-03T03:44:09+05:30 IST

క్షణికావేశంతో చేసిన తప్పుల్ని సరిచేసుకోవాలని మండ లన్యాయసేవా కమిటీచైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ అన్నారు.

క్షణికావేశంతో చేసిన తప్పుల్ని సరిచేసుకోవాలి
ఖైదీలతో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ

ఆసిఫాబాద్‌, జూలై 2: క్షణికావేశంతో చేసిన తప్పుల్ని సరిచేసుకోవాలని మండ లన్యాయసేవా కమిటీచైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ అన్నారు. శుక్ర వారం జిల్లాకేంద్రంలోని సబ్‌జైలును సంద ర్శించారు. ఈసందర్భంగా ఖైదీలతో మాట్లా డుతూ ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేకపోతే మండల న్యాయసేవా కమిటీద్వారా ఉచితంగా న్యాయసహా యం, న్యాయవాదిని నియమించుకోవచ్చని తెలి పారు. ఖైదీలబాగోగులు అడిగితెలుసుకున్నారు. ఖైదీలు సత్ప్ర వర్తనతో మెలగాలని, క్రమశిక్షణలోబడి ఉండాల న్నారు. అనంతరం న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు. ప్యానెల్‌అడ్వకేట్లు విద్యాసాగర్‌, నగేష్‌, జైలుసూపరిం టెండెంట్‌ ప్రేంకుమార్‌, కోర్టుసిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-07-03T03:44:09+05:30 IST