యువకుడి ట్వీట్కు స్పందించిన అధికారులు
ABN , First Publish Date - 2020-05-29T10:41:11+05:30 IST
తమ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఈ నెల 24న మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొడిమ్యాల
ప్రారంభమైన మిషన్ భగీరథ పనులు
వెల్గటూర్, మే 28: తమ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఈ నెల 24న మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొడిమ్యాల శ్రీనివాస్ అనే యువకుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. స్పందించిన గ్రిడ్ ఏఈ రాహుల్, ఇంట్రా ఏఈ వివేక్ అదే రోజు హుటా హుటిన వెంకటాపూర్ గ్రామానికి చేరుకొని పరిశీలించారు. ట్రయల్ రన్ నిర్వహించి వారం రోజుల్లో భగీరథ నీరు అందిస్తామన్నారు. శ్రీనివాస్ను గ్రామస్తులు అభినందించారు.