సలుగుపల్లిని సందర్శించిన మిషన్‌ భగీరథ డీఈఈ

ABN , First Publish Date - 2022-08-09T04:23:45+05:30 IST

మండలంలోని సల్గుపల్లి గ్రామాన్ని మిషన్‌ భగీరథ అధికారులు సోమవారం సందర్శించారు. సల్గుపల్లిలో గ్రామంలో అతిసారతో 20మంది అస్వస్తతకు గురికావటంతో ఆ గ్రామాన్ని కాగజ్‌నగర్‌ మిషన్‌ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పృథ్వీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ అభిలాష్‌, కెమిస్ట్‌ నవీన్‌, మైక్రో బయాలజిస్ట్‌ ప్రసాద్‌, ఫీల్డు అసిస్టెంట్‌ సంపత్‌ పరిశీలించారు.

సలుగుపల్లిని సందర్శించిన మిషన్‌ భగీరథ డీఈఈ
గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న డీఈఈ పృథ్వీరాజ్‌

బెజ్జూరు, ఆగస్టు 8: మండలంలోని సల్గుపల్లి గ్రామాన్ని మిషన్‌ భగీరథ అధికారులు సోమవారం సందర్శించారు. సల్గుపల్లిలో గ్రామంలో అతిసారతో 20మంది అస్వస్తతకు గురికావటంతో ఆ గ్రామాన్ని కాగజ్‌నగర్‌ మిషన్‌ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పృథ్వీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ అభిలాష్‌, కెమిస్ట్‌ నవీన్‌, మైక్రో బయాలజిస్ట్‌ ప్రసాద్‌, ఫీల్డు అసిస్టెంట్‌ సంపత్‌ పరిశీలించారు. అనంతరం నీటి వినియోగంపై డీఈఈ పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులకు వివరించారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో తాగునీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని సూచించారు. 

Updated Date - 2022-08-09T04:23:45+05:30 IST