మహిళ అదృశ్యం

ABN , First Publish Date - 2022-08-11T05:48:01+05:30 IST

మండలంలోని గోరాన్‌చెరువు పంచాయతీకి చెందిన శ్రీదేవి (24) అదృశ్యమైందని ఆమె భర్త వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

మహిళ అదృశ్యం
అదృశ్యమైన శ్రీదేవి

గాలివీడు, ఆగస్టు 10: మండలంలోని గోరాన్‌చెరువు పంచాయతీకి చెందిన శ్రీదేవి (24) అదృశ్యమైందని ఆమె భర్త వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. తన భార్య శ్రీదేవిది కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల గ్రామం అని, తాము ఇద్దరం ప్రేమించి 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత తాను గాలివీడులోని పెద్దూరులో రూము తీసుకొని సంసారం పెట్టానని తెలిపారు. తాను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, గత నెల జూలై 13వ తేదీ తాను డ్రైవర్‌గా వెళ్లానని, తిరిగి 17వ తేదీ ఇంటికి చేరుకోగా అప్పటికే తన భార్య శ్రీదేవి ఇంటిలో లేదన్నారు. ఆమె సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ ఆయ్యిందన్నారు. జూలై 13వ తేదీ చివరిసారిగా కాల్‌ చేసిందని, ఆ తర్వాత చేయలేదని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని తన బంధువులకు సమాచారం అందించి వెతికించినా... కానీ ఇప్పటి వరకు ఆమె ఆచూకీ తెలియలేదన్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.


 

Updated Date - 2022-08-11T05:48:01+05:30 IST