అదృశ్యమైన మహిళ శవమై..
ABN , First Publish Date - 2020-10-20T06:29:54+05:30 IST
అదృశ్యమై మహిళ శవమై కనిపించిన సంఘటన పరిగి మండలం రాఘవాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన తాండ్ర బాలమణి(38), కూరగాయల కోసం శనివారం ఇంటి నుంచి పరిగికి వెళ్లింది.
పరిగి: అదృశ్యమై మహిళ శవమై కనిపించిన సంఘటన పరిగి మండలం రాఘవాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన తాండ్ర బాలమణి(38), కూరగాయల కోసం శనివారం ఇంటి నుంచి పరిగికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువుల దగ్గర వెతికారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో శనివారం కొడుకు వినోద్ పరిగి పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద కేసు నమోదైంది. సోమవారం సదరు మహిళ రాఘవాపూర్ శివారులోని పొలంలో శవమై కనిపిచింది. సీఐ డీకే లక్ష్మీరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానస్పద మృతి కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.