13 కోట్లతో వాటికి ఇన్సూరెన్స్.. అందరికంటే నావే పెద్దవి అంటూ.. మిస్ బమ్బమ్ సంచలన నిర్ణయం!
ABN , First Publish Date - 2021-11-14T03:49:57+05:30 IST
అందుకే ఓ అడుగు ముందుకేసి మరీ వాటిని రూ.13 కోట్లకు బీమా చేసింది. ‘‘బ్రెజిల్లో అందరికంటే పెద్ద పిరుదులు నావే..! వాటి వల్లే నాకీ పాపులారిటీ వచ్చింది. కాబట్టే
ఇంటర్నెట్ డెస్క్: ఆమె పేరు నాథీ.. ఈ ఏడాది బ్రెజిల్లో మిస్ బమ్బమ్-2021 టైటిల్ను గెలుచుకుంది. అత్యంత సుందరమైన, పెద్దవైన పిరుదులు కలిగిన మహిళగా ఆమె ఈ టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు తన సంపదపై మరింత మక్కువ పెరిగింది. అందుకే ఓ అడుగు ముందుకేసి మరీ వాటిని రూ.13 కోట్లకు బీమా చేసింది. ‘‘బ్రెజిల్లో అందరికంటే పెద్ద పిరుదులు నావే..! వాటి వల్లే నాకీ పాపులారిటీ వచ్చింది. కాబట్టే ఈ స్థాయిలో ఇన్సూరెన్స్ చేయించా.. అయితే.. నాకీ సైజ్ సరిపోలేదు. ఇంకా పెంచుకునేందుకు ఎక్సర్సైజులు చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది మిస్ బమ్బమ్-2021. నాథీకి ఇద్దరు పిల్లలు. ఈ ఏడాదే రెండో పాపకు జన్మనిచ్చింది. ‘‘కొత్తగా తల్లైన మహిళలు తమ శరీరాకృతికి సంబంధించి ఎంతో వ్యధ చెందుతుంటారు. ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు నాకు చేతనైనంత చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది మిస్ బమ్బమ్.