54,783 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2021-10-19T05:48:40+05:30 IST

మిర్చియార్డుకు సోమవారం 58,752 టిక్కీలు రాగా, నిల్వ ఉన్న వాటితో కలిపి 54,783 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

54,783 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు సోమవారం 58,752 టిక్కీలు రాగా, నిల్వ ఉన్న వాటితో కలిపి 54,783 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 13,325 టిక్కీలు నిల్వ ఉన్నాయి. సోమవారం యార్డులో నాన ఏసీ కామన వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ. 13,200, నాన ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ. 16,100, నాన ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,300, ఏసీ కామన్‌ వెరైటీకి రూ.7,000, రూ.13,000, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ.7,000, రూ.14,300, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ. 8,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-10-19T05:48:40+05:30 IST