1,34,257 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2021-04-13T05:54:53+05:30 IST

మిర్చియార్డుకు సోమవారం మొత్తం 1,86,960 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 1,34,257 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

1,34,257 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, ిఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు సోమవారం మొత్తం 1,86,960 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 1,34,257 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 2,40,743 టిక్కీలు నిల్వ ఉన్నాయి. సోమవారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ.5,500, గరిష్టంగా రూ.14,800, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.5,500, రూ.17,000, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ.5,000, రూ.9,000 ధర లభించినట్లు సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.  

Updated Date - 2021-04-13T05:54:53+05:30 IST