రెండు రోజుల పాటు మంత్రి ప్రశాంత్రెడ్డి పర్యటన
ABN , First Publish Date - 2020-05-27T11:01:01+05:30 IST
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల పాటు మంత్రి ప్రశాంత్రెడ్డి పర్యటించనున్నారు.
రైతు సదస్సుల్లో పాల్గొననున్న మంత్రి
నిజామాబాద్ అర్బన్, మే 26: ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల పాటు మంత్రి ప్రశాంత్రెడ్డి పర్యటించనున్నారు. రెండు జిల్లాల పరిఽధిలో జరిగే రైతు సదస్సుల్లో ఆయన పాల్గొంటారు. నేడు కామారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ గ్రామంలోని లోయపల్లి భూపతిరావు ఫంక్షన్హాల్లో జరిగే రైతుసదస్సులో మంత్రి పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండల కేంద్రంలో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు. ఈనెల 28న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో ఉదయం 9 గంటలకు జరిగే రైతు సదస్సులో మంత్రి పాల్గొంటారు. అదేరోజు మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.