ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్మిక శాఖ మంత్రి ప్రమేయం

ABN , First Publish Date - 2020-09-22T08:49:25+05:30 IST

ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్మిక శాఖ మంత్రి గుమ్మునూరు జ యరాం ప్రమేయం ఉంద ని టీడీపీ నాయకులు ఆ రోపించారు. స్కామ్‌లో ఉన్న 1

ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్మిక శాఖ మంత్రి ప్రమేయం

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 21: ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్మిక శాఖ మంత్రి గుమ్మునూరు జ యరాం ప్రమేయం ఉంద ని టీడీపీ నాయకులు ఆ రోపించారు. స్కామ్‌లో ఉన్న 14వ ముద్దాయి అ యిన తెలుకపల్లి కార్తీక్‌తో మంత్రికి సంబంధాలు ఉన్నాయని వారు పేర్కొ న్నారు. బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.


అధికార వైసీపీ రాజకీయ కక్ష్య సాధింపుతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడుపై ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర లేబర్‌, ఎంప్లాయిమెంట్‌, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌, ఆయన తనయుడు ఈశ్వర్‌లు ఈ కుంభకోణంలో పాత్రదారులని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-22T08:49:25+05:30 IST