ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-05-24T09:38:33+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు.

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు


యానాం, మే 22: కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయన్నారు. పుదుచ్చేరిలో 23, మహెలో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యానాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - 2020-05-24T09:38:33+05:30 IST