‘ఓటీఎ్సపై రాజకీయం చేస్తోన్న టీడీపీ’
ABN , First Publish Date - 2021-12-05T05:33:30+05:30 IST
సర్పవరం జంక్షన్, డిసెంబరు 4: నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్లకు ఓటీఎస్ పథకం ద్వారా లబ్ధిదారుల పేరు మీద ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోందని, దీన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. రమణయ్యపేట శివారు
సర్పవరం జంక్షన్, డిసెంబరు 4: నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్లకు ఓటీఎస్ పథకం ద్వారా లబ్ధిదారుల పేరు మీద ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోందని, దీన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. రమణయ్యపేట శివారు బాపన్నదొరకాలనీ, బాలాజీనగర్ ప్రాంతాల్లో శనివారం ఆయన పాదయాత్ర చేపట్టి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. ఎంపీడీవో పి.నారాయణమూ ర్తి, తహశీల్దార్ వి.మురార్జీ, జడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, కార్పొరేటర్ వడ్డి మణికుమార్ పాల్గొన్నారు.