నేడు కూకట్పల్లిలో మంత్రి KTR పర్యటన
ABN , First Publish Date - 2021-08-06T15:15:36+05:30 IST
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 138 కోట్లతో ఫతేనగర్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను కేటీఆర్ ప్రారంభించనున్నారు. పారిశ్రామిక వ్యర్ధాల నీరు శుద్ధి చేసేలా ఫతేనగర్లో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. కూకట్పల్లి నుంచి హుస్సేన్ సాగర్కు వెళ్లే వ్యర్ధాల కట్టడి కోసం 100 మిలియన్ టన్నుల ఎస్టీపీకి సంబంధించిన పనులను ఇవాళ మంత్రి ప్రారంభించనున్నారు.