నోముల పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ నివాళులు

ABN , First Publish Date - 2020-12-01T17:02:24+05:30 IST

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు.

నోముల పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ నివాళులు

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. కొత్తపేట మార్గదర్శి కాలనీలోని నోముల నివాసానికి చేరుకుని నరసింహ పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.  అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పి నోముల కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఓదార్చారు.

Updated Date - 2020-12-01T17:02:24+05:30 IST